Jagan: సీఎం జగన్ ఫొటోకు నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాల పాలాభిషేకం!

  • ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ ప్రవేశపెట్టడంపై సంతోషం
  • ఆర్థిక సాయంతో ఆత్మస్థైర్యం నింపారన్న మత్స్యకారులు
  • తుమ్మలపెంట సముద్రతీరంలో ఘటన 
Fisheman families express happiness about YSR Matsyakara Bharosa

వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించారని, తమ కుటుంబాల్లో ఆత్మ స్థైర్యం నింపారంటూ సీఎం జగన్ పై నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలు ప్రశంసలు కురిపించాయి.

ఈ సందర్భంగా  కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో జగన్, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సముద్రతీరం వద్దే మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, అందుకు వారికి రుణపడి ఉంటామని అన్నారు. ఇదిలా ఉండగా, ‘కరోనా’, లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో వాటిని పట్టించుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా ఈ కార్యక్రమం నిర్వహించడంపై విమర్శలు తలెత్తాయి.

More Telugu News