Rashmi Gautam: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • యాంకరింగులో పోటీ గురించి రష్మి 
  • వక్కంతం దర్శకత్వంలో రవితేజ
  • పారితోషికాన్ని తగ్గించుకున్న నటుడు  
Rashmi Goutham about competition

 *  పోటీ అనేది ఏ రంగంలోనైనా సరే మంచిదే అని చెబుతోంది స్టార్ యాంకర్ రష్మి. కొత్తగా యాంకరింగులోకి వస్తున్న అమ్మాయిల గురించి ప్రస్తావిస్తే ఆమె అలా చెప్పింది.  'సుమగారి వంటి స్టార్ యాంకర్ల మధ్య నేను, అనసూయ కూడా ఓ స్థానాన్ని సంపాదించుకున్నాం. అనసూయ, నేను సక్సెస్ సాధించామంటే మాకు మేం కొత్త ట్రెండ్ సృష్టించుకున్నాం. అలా చేయగలిగితే ఎవరైనా కూడా నిలబడగలుగుతారు' అని చెప్పింది రష్మి.    
*  'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత వక్కంతం వంశీ ఆ సినిమా పరాజయం పాలవడంతో వెనుకపడ్డాడు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో రవితేజ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుందట.
*  కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అలాగే సినిమా రంగం కూడా బాగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు' ఫేం, నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంథోనీ తన పారితోషికాన్ని 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా విజయ్ ను కోలీవుడ్ నిర్మాతలు అభినందిస్తున్నారు.

More Telugu News