Vanasthalipuram: మూడు కుటుంబాల్లో కరోనా కల్లోలం... వనస్థలిపురంలో వారం రోజుల రాకపోకలు బంద్!

  • వనస్థలిపురంలో 8 కంటైన్మెంట్ జోన్లు
  • ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు
  • 169 కుటుంబాలకు హోం క్వారంటైన్
Eight containment zones announced in Vanasthalipuram area

హైదరాబాద్ వనస్థలిపురంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వనస్థలిపురంలోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో రేపటి నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.

వనస్థలిపురంలోని హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్కేడీ నగర్ లతో పాటు రైతు బజార్-సాహెబ్ నగర్ రహదారిని కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా బారినపడడంతో ఈ చర్యలు తీసుకున్నారు. వనస్థలిపురం ప్రాంతంలో ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురం పరిధిలో 169 కుటుంబాలు హోం క్వారంటైన్ లో ఉన్నాయి.

More Telugu News