YV Subba Reddy: తిరుమలలో ఇక ఒకేసారి వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాతే తిరిగి దర్శనాలు
  • కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంది
  • క్యూలైన్లలో పలు మార్పులు
  • మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు కల్పిస్తాం
yv subbareddy on ttd

లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు భక్తులకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు.

అయితే, గతంలోలా వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండవని సుబ్బారెడ్డి తెలిపారు. కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఉంటాయని చెప్పారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

More Telugu News