రిషి కపూర్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లొద్దు: ముంబై పోలీసులు
- భౌతికకాయాన్ని నేరుగా శ్మశానానికే తీసుకెళ్లాలి
- పెద్ద సంఖ్యలో జనాలు హాజరుకాకూడదన్న పోలీసులు
- చందన్ వాడి శ్మశానవాటికలో ఈ సాయంత్రం అంత్యక్రియలు
ఆసుపత్రి నుంచి రిషి భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లరాదని... నేరుగా శ్మశానానికి తీసుకెళ్లాలని సూచించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరుకాకూడదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే అంత్యక్రియలకు హాజరవుతారని తెలుస్తోంది. చందన్ వాడి శ్మశానవాటికలో ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.