Chandrababu: చంద్రబాబు పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత విద్యాసాగర్

  • లోన్లు తీసుకుని స్వాహా చేశారంటూ మనోహర్ పై ఫిర్యాదు
  • కలకలం రేపుతున్న కుప్పం టౌన్ బ్యాంకు స్కాం
  • ఇప్పటికే నలుగురు బ్యాంక్ సస్పెన్షన్
YSRCP leader files police complaint on Chandrababu PA

టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకున్నారని.. ఆ డబ్బును స్వాహా చేసేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

మరోవైపు కుప్పం టౌన్ బ్యాంకులో రూ. 1.9 కోట్ల స్కాం జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొందరు ప్రముఖులు లోన్లు తీసుకుని స్వాహా చేశారని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మేనేజర్, అప్రైజర్ మరో ఇద్దరు సిబ్బంది కూడా ఈ స్కాంలో ఉన్నట్టు సమాచారం. దీంతో, ఈ నలుగురిని బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మనోహర్ పై విద్యాసాగర్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

More Telugu News