Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • రవితేజతో మరోసారి త్రిష జోడీ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రద్ధా కపూర్
  • నాగశౌర్య తాజా ప్రాజక్ట్
Trisha to roamce with Raviteja again

 *  గతంలో 'కృష్ణ' సినిమాలో జోడీ కట్టిన రవితేజ, త్రిష జంట ఇప్పుడు మరో సారి జత కట్టే అవకాశం కనిపిస్తోంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని చేయనున్నాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు త్రిషను ఎంపిక చేసినట్టు సమాచారం.
*  మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మహేశ్ సరసన చేయడానికి ఆమె కూడా ఆసక్తి చూపుతోందని, ప్రస్తుతం డేట్స్ సర్దుబాటు చేసే ప్రయత్నంలో వుందని అంటున్నారు.
*  యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేం సాగర్ చంద్ర దర్శకత్వంలో చేయనున్నాడు. సాగర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

More Telugu News