కరోనా నుంచి కోలుకుని వచ్చిన వారికి స్వాగతం పలికిన వారిపై కేసు నమోదు!
- ఢిల్లీకి వెళ్లి వచ్చిన తమిళనాడు వ్యక్తికి కరోనా
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పుడు ఘన స్వాగతం
- లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు
ఆసుపత్రి నుంచి తన నివాస ప్రాంతానికి తిరిగి వచ్చిన అతనికి బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి, ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. దీంతో, స్వాగత ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.