India: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కౌంటర్‌ ఇచ్చిన భారత్‌

Bizarre comments India trashes Imran Khan tweet
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ముస్లింలను లక్ష్యం చేసుకుని ఉద్దేశపూర్వకంగా భారత్‌ పలు చర్యలకు పాల్పడుతోందంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆర్గనైజేషన్‌ ఆఫ్ ఇస్లామిక్‌ కార్పోరేషన్ (ఐఓసీ) చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పాక్ తీరుపై స్పందిస్తూ... 'పాకిస్థాన్‌ తమ దేశంలోని దుస్థితిపై నుంచి దృష్టిని మళ్లించడానికే ఇటువంటి రోత పుట్టించే వ్యాఖ్యలు చేస్తోంది. తమ దేశంలోని కొవిడ్‌-19పై దృష్టి కేంద్రీకరించకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది' అని వ్యాఖ్యానించారు.

పాక్‌లోని హిందువుల పరిస్థితులపై శ్రీవాస్తవ స్పందిస్తూ... 'ముందు తమ దేశంలోని మైనార్టీల దుస్థితిపై పాకిస్థాన్‌ దృష్టి పెట్టాలి' అని కౌంటర్‌ ఇచ్చారు. కాగా, జర్మనీలో యూదులపై నాజీలు పాల్పడ్డ చర్యల మాదిరిగా భారత్‌లో ముస్లింలపై వివక్ష చూపుతున్నారని కరోనా విజృంభణను ఉద్దేశిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
India
Pakistan
COVID-19

More Telugu News