కేంద్ర మంత్రుల కీలక భేటీ.. లాక్డౌన్ సడలింపులపై చర్చ
- ఎల్లుండి నుంచి లాక్డౌన్ సడలింపులు
- దేశ ఆర్థిక వ్యవస్థను తిరగి బలపర్చడంపై చర్చ
- ప్రతిపాదనలను మోదీకి సమర్పించనున్న కేంద్ర మంత్రులు
ఈ భేటీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, రామ్ విలాస్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వస్తువుల సరఫరాకు ఏర్పడుతున్న అడ్డంకులు, వాటి సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపాదనలను నివేదిక రూపంలో వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పించనున్నారు. నిన్న కూడా కేంద్ర మంత్రులు కొందరు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.