కడపలో కరోనా నుంచి కోలుకున్న 13 మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు
- కోలుకున్నవారికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్
- వైద్య సిబ్బందికి అభినందనలు
- ఏపీలో 534 కరోనా పాజిటివ్ కేసులు
ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, వారికి అంకితభావంతో సేవలు అందించారంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రస్తుతం ఏపీలో 534 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గుంటూరు (122), కర్నూలు (113) జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.