TTD: మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

  • ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
  • శ్రీవారి దర్శనాలను మే 3 వరకు రద్దు చేసిన టీటీడీ
  • మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవల రద్దు
TTD stops darshan up to 3rd may

ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం హాట్ స్పాట్ లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు... వారి టికెట్ వివరాలను, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ను పంపాలని సూచించింది. helpdesk@tirumala.org కి వివరాలను పంపాలని టీటీడీ అధికారులు తెలిపారు.

More Telugu News