హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతున్న శ్రీకాకుళం వాసి అరెస్ట్
- పగలు రెక్కీ.. రాత్రి చోరీ
- 1999 నుంచి చోరీలు మొదలు
- నిందితుడి నుంచి 72 తులాల బంగారం, రూ. 4 లక్షల నగదు స్వాధీనం
రాచకొండ కమిషనరేట్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2019 నుంచి గత నెల వరకు మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 24 చోరీలకు పాల్పడ్డాడు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్న మీర్పేట పోలీసులు 72 తులాల బంగారం, కారు, రెండు టీవీలు, రూ. 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.