9 baje 9 minutes: లైట్లు ఆపితే చాలు విద్యుత్ గృహోపకరణాలు ఆపక్కర్లేదని ప్రభుత్వ సూచన

  • కేవలం విద్యుత్‌ దీపాలు ఆపితే సరిపోతుంది
  • టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కంప్యూటర్లు ఆపక్కర్లేదు
  • ఏపీ ప్రజలకు ప్రభుత్వ సూచన
Do not disconnect electric home appliances

‘కరోనా’ మహమ్మారితో అలముకున్న సంక్షోభపు అంధకారాన్ని తొలగించడానికి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించమని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఓ సూచన చేసింది. కేవలం విద్యుత్‌ దీపాలను మాత్రమే ఆపితే సరిపోతుందని, ఇతర విద్యుత్‌ గృహోపకరణాలు టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కంప్యూటర్లు మొదలగు వాటిని ఆపాల్సిన ఆవసరం లేదని స్పష్టం చేసింది.

More Telugu News