Chiranjeevi: చిరూతో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి?

  • కొరటాలతో చిరూ 'ఆచార్య'  
  •  కథపై కసరత్తు చేస్తున్న పూరి 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
puri Jagannadh Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళతారా? అనేది ఆసక్తికరంగా మారింది. అన్నీ కుదిరితే పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లొచ్చుననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

చిరంజీవి 150వ సినిమానే పూరి చేయవలసింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. ఎప్పటికైనా చిరంజీవితో ఓ సినిమా తప్పకుండా చేస్తానని అప్పట్లోనే పూరి చెప్పాడు. ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకుని ఆయన ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ పై  కొంతకాలంగా కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాను ఒక పెద్ద హీరోకి సంబంధించిన కథపై వున్నానని తాజాగా పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పడంతో, ఆ హీరో చిరంజీవినే అని అంతా అనుకుంటున్నారు. అదే నిజమైతే ఈ సారైనా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి మరి.

More Telugu News