Vaishnav Tej: మే నెలకి వెళ్లిన 'ఉప్పెన'!

  • రేపు విడుదల కావలసిన 'ఉప్పెన'
  • కథానాయికగా కృతి శెట్టి పరిచయం 
  • మే మొదటివారంలో విడుదల
Uppena Movie

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఉప్పెన' నిర్మితమైంది. గ్రామీణ వాతావరణం .. జాలరుల జీవితం .. ఈ నేపథ్యంలో అల్లిన ప్రేమకథగా ఈ సినిమా రూపొందింది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే చెప్పారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడింది.

కరోనా పరిస్థితులు ఒక కొలిక్కి వస్తే, మే మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ అమ్మాయి స్టిల్స్ చూసే కుర్రాళ్లంతా మనసులను పారేసుకున్నారు. టీజర్ వదిలిన దగ్గర నుంచి సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. విడుదలకి ముందే ఈ సుందరికి వరుస అవకాశాలు వస్తున్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్.

More Telugu News