Prabhas: ఓల్డ్ గెటప్ లోను కనిపించనున్న ప్రభాస్

  • షూటింగు దశలో ప్రభాస్ మూవీ 
  •  కథానాయికగా పూజ హెగ్డే 
  •  అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
Radhakrishna Kumar Movie

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ కథ రెండు కాలాల్లో సాగుతుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని చెబుతున్నారు.

 ఆయన లుక్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. వివిధ దేశాల్లో ప్రభాస్ కి ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. అందువలన తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News