New Delhi: ఢిల్లీ వెళ్లొచ్చిన నలుగురు విశాఖ వాసులకు కరోనా పాజిటివ్

  • ఏపీలో 44కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
  • హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నోడల్ అధికారి
  • ఇద్దరు డిశ్చార్జి అయినట్టు వెల్లడి
Four more corona positive cases in AP

కరోనా వైరస్ భూతం ఏపీలోనూ కోరలు చాస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన మతపరమైన సమ్మేళనానికి వెళ్లొచ్చిన నలుగురు విశాఖ వాసులు కరోనా బారినపడ్డారు. దాంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 44కి చేరింది.

ఈ మేరకు కరోనా నోడల్ అధికారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9 కేసులు, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కాగా, కరోనా పాజిటివ్ బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

More Telugu News