Chiranjeevi: సినీ కార్మికులపై మీరు చూపిన కరుణకు హృదయపూర్వక ధన్యవాదాలు: చిరంజీవి

  • కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ హీరోలు
  • ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారో పోస్ట్ చేసిన చిరంజీవి
  • విరాళాలు ప్రకటించిన వారిలో నాని,అల్లు అర్జున్, సుశాంత్ తదితరులు
Hero Chiranjeevi hearty thanks to tolly wood

సినీ కార్మికులకు అండగా ఉండే నిమిత్తం చిత్ర పరిశ్రమ నుంచి కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన వారికి ప్రముఖ హీరో చిరంజీవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసిన చిరంజీవి, తాజాగా ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారన్న వివరాలను ఇందులో పొందుపరిచారు. నాని- రూ.30 లక్షలు, అల్లు అర్జున్- రూ. 20 లక్షలు, శ్రీమిత్రా చౌదరి- రూ.5 లక్షలు, సుశాంత్- రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్- రూ.2 లక్షలు, సంపూర్ణేశ్ బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించినట్టు ఆ పోస్ట్ లో తెలిపారు.

More Telugu News