లాక్ డౌన్ పొడిగింపు వార్తలు నిరాధారమన్న కేంద్రం!

Lockdown Extend rumers are Baseless
  • ఏప్రిల్ 15తో ముగియనున్న లాక్ డౌన్
  • కానీ పొడిగిస్తారని వార్తలు
  • నిరాధారమన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి
కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15తో ముగియనున్న నేపథ్యంలో, ఆ తరువాత లాక్ డౌన్ ను మరిన్ని రోజుల పాటు పొడిగించనున్నారని వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఈ వార్తలు నిరాధారమైనవని ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వ అధికారిక మీడియా విభాగం పీటీఐ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెల్లడించింది.

 "కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ ముగిసిన తరువాత దాన్ని పొడిగిస్తారనడం నిరాధారం. కేంద్ర కార్యదర్శులు సైతం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు" అని వివరణ ఇచ్చింది. కాగా, ఈ వార్తలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ను పొడిగించే ఎటువంటి ఆలోచనా కేంద్రం చేయడం లేదని అన్నారు.
Go Back to Shorts
Lockdown
Extened
Baseless
Corona Virus

More Telugu News