మరిన్ని నగరాల్లో లాక్డౌన్.. ప్రజలను సిద్ధం చేసిన వియత్నాం ప్రధాని!
- ప్రస్తుతం ప్రతీ నిమిషం, ప్రతీ గంట ఎంతో కీలకం
- హనోయ్, హోచిమిన్ నగరాల్లోనూ లాక్డౌన్ అమలు చేస్తామన్న ప్రధాని
- దేశంలో 200 దాటని కరోనా కేసులు
ప్రస్తుతం ప్రతీ నిమిషం, ప్రతీ గంట ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. పైన చెప్పిన రెండు నగరాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఏ క్షణమైనా కఠిన నిర్ణయాలు అమలు చేసే పరిస్థితి రావొచ్చని ప్రజలను సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. చైనాను ఆనుకుని ఉండే ఈ చిన్నదేశం కరోనా వైరస్ కట్టడిలో చైనా కంటే ముందే మేల్కొంది. ప్రపంచంలో మిగతా దేశాల కంటే ముందే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. నగరాలను శుభ్రం చేసింది. పూర్తిగా అప్రమత్తమైంది. ఈ కారణంగా ప్రపంచం మొత్తం కోవిడ్తో అల్లాడుతున్నా.. వియత్నాంలో మాత్రం కేసుల సంఖ్య ఇప్పటికీ 200 దాటలేదు.