Corona Virus: ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు.. ఇద్దరు వైద్యులకు కరోనా లక్షణాలు

  • విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు
  • 12కు చేరిన కేసుల సంఖ్య
  • ఇద్దరు స్విమ్స్ వైద్యులు క్వారంటైన్ కు తరలింపు
One more corona case in Andhra Pradesh

ఏపీలో కరోనా మహమ్మారి నెమ్మదిగా విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన ఓ కరోనా పాజిటివ్ వ్యక్తికి బంధువైన మరో వ్యక్తికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరుకుంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 317 మందికి నెగెటివ్ గా తేలింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు తిరుపతిలోని ఇద్దరు స్విమ్స్ వైద్యులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో... వారి నమూనాలను సేకరించారు. ఇద్దరిని క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో స్విమ్స్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

More Telugu News