వికారాబాద్ జిల్లాలో.. గ్రామసర్పంచ్ అపర్ణ ఆత్మహత్య!
చిన్న వయసులోనే తమ గ్రామానికి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. ప్రజల సమస్యలు తీర్చడంలో ముందు నిలిచి అందరి మన్ననలూ అందుకుంది. ఇంతలోనే ఏం కష్టం వచ్చిందో ఏమో... బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం తిమ్మాయిపల్లిలో విషాదాన్ని నింపింది. గ్రామ సర్పంచ్ గా గత సంవత్సరం ఎన్నికైన అపర్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం, బుధవారం అర్థరాత్రి అపర్ణ పురుగుల ముందు తాగింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచారు. అపర్ణ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె మృతిపట్ల గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం, బుధవారం అర్థరాత్రి అపర్ణ పురుగుల ముందు తాగింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచారు. అపర్ణ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె మృతిపట్ల గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.