APPSC: కరోనా ప్రభావంతో వెనక్కి వెళ్లిన ఏపీపీఎస్సీ పరీక్షలు

  • ఏపీలోనూ కరోనా ప్రభావం
  • మార్చి, ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలు
  • కరోనా కారణంగా వాయిదా వేశామని చెప్పిన ఏపీపీఎస్సీ కార్యదర్శి
APPSC Exams postpone due to corona

కరోనా వైరస్ ధాటికి వ్యవస్థలే కుప్పకూలుతున్నాయి. తాజాగా ఏపీలో మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలు, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ డిగ్రీ కాలేజి లెక్చరర్లు, కంప్యూటర్ నిపుణత పరీక్షలను కరోనా ప్రభావంతో వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.

More Telugu News