Corona Virus: ఏపీలో మూడు జిల్లాల్లో కరోనా వ్యాపించినట్టు కేంద్రం వెల్లడి

  • దేశంలో కరోనా ప్రభావిత జిల్లాల జాబితా విడుదల చేసిన కేంద్రం
  • ప్రకాశం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో కరోనా ప్రభావం
  • తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా
Three districts in AP effected by corona

దేశంలో కరోనా వ్యాపించిన జిల్లాలను కేంద్రం తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలో 3 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్టు తెలిపింది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కరోనా ప్రభావం ఉందని వివరించింది. అటు తెలంగాణలో 5 జిల్లాల్లో కరోనా వ్యాపించినట్టు పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని 7 జిల్లాల్లోనూ కరోనా ప్రభావం ఉందని కేంద్రం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోని 10 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉద్ధృతంగా ఉందని వివరించింది.

More Telugu News