Chittoor District: చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం... వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు

  • వ్యవసాయబావిలో మృతదేహాల గుర్తింపు
  • ఒక మహిళ, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు వెలికితీత
  • స్థానికేతరులుగా భావిస్తున్న పోలీసులు

చిత్తూరు జిల్లాలో ఓ వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావిలో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ నలుగురిలో ఒకరు మహిళ కాగా, మిగతా ముగ్గురు పదేళ్ల లోపు చిన్నారులు కావడం అక్కడివారిని కలచివేసింది. వారిని తల్లీబిడ్డలుగా భావిస్తున్నారు. ఎక్కడినుంచో వచ్చి ఆ బావిలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

More Telugu News