ఇటలీలో కరోనా తుపాన్.. ఒక్క రోజులో 475 మంది బలి!

Corona deaths raises in Italy 475 dead in one day
  • చైనాలో ఈ స్థాయిలో నమోదు కాని మరణాలు
  • ఇటలీలో 2,978కి చేరుకున్న మృతుల సంఖ్య
  • ప్రపంచవ్యాప్తంగా 8 వేల మందికిపైగా మృతి
చైనాలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 ఇప్పుడు ఇటలీని కుదిపేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 475 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా మరణాలతో కలిపి ఇటలీలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,978కి చేరుకుంది.  బాధితుల సంఖ్య 35,713కు చేరుకుంది.

ఇక, కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మరోవైపు, కరోనా వైరస్‌పై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ వెలుగు చూసిన వూహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. దేశంలో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని వివరించింది. వూహాన్, హుబేయి ప్రాంతాల్లో ఆంక్షలను సడలించింది.
Go Back to Shorts
China
Italy
Corona Virus
Corona Deaths

More Telugu News