Chiranjeevi: ఆలస్యం కానున్న చిరంజీవి 'ఆచార్య'

  • కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య'
  • డిఫరెంట్ లుక్ తో చిరంజీవి 
  •  విడుదల తేదీ మారే అవకాశం
Acharya Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాను చేస్తున్నాడు. చిరంజీవి క్రేజ్ కి తగినట్టుగా ఈ కథను తీర్చిదిద్దిన ఆయన, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చకచకా షూటింగును కానిచ్చేస్తున్నాడు. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ఊహించని విధంగా కరోనా వైరస్ దాడి మొదలైంది. వివిధ భాషల్లో నిర్మాణంలో వున్న సినిమాల షూటింగులు ఆగిపోయాయి.

కరోనా ఎఫెక్ట్ కారణంగా కొరటాల కూడా ఈ సినిమా షూటింగును వాయిదా వేశాడు. అనుకోకుండా ఏర్పడిన ఈ అంతరాయం వలన, షెడ్యూల్స్ ను మార్చుకోవలసి వస్తుంది. ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి షెడ్యూల్స్ ను తిరిగి ప్లాన్ చేయడానికి ఎక్కువ సమయమే పడుతుంది. షూటింగు పరంగా జరుగుతున్న జాప్యం వలన, విడుదల విషయంలోను ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఆగస్టులో విడుదల కాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News