Ram: 'రెడ్' బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోందట

  • కిషోర్ తిరుమల నుంచి 'రెడ్' 
  • రామ్ జోడీగా ముగ్గురు కథానాయికలు 
  • ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్  
Kishore Thirumala Movie

రామ్ కథానాయకుడిగా దర్శకుడు కిషోర్ తిరుమల 'రెడ్' సినిమాను రూపొందిస్తున్నాడు. తమిళంలో క్రితం ఏడాది విజయాన్ని సాధించిన 'తడమ్' కి ఇది రీమేక్. ఆ సినిమాలో అరుణ్ విజయ్ చేసిన పాత్రను, తెలుగులో రామ్ చేస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ మొదలైపోయింది. ఆంధ్రాకి 9 కోట్ల రేషియోలో ఇచ్చారట. సీడెడ్ కి 4 కోట్ల రేషియోలో ఇచ్చారట. నైజామ్ కి సంబంధించిన బిజినెస్ డీల్ గురించి తెలియవలసి వుంది. ఇంతవరకూ వచ్చింది మంచి రేటేనని చెబుతున్నారు.

ఇంతకుముందు రామ్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని సాధించడం, ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు. అంతేకాదు .. ఈ సీజన్ లో సరైన సినిమా లేకపోవడం కూడా, ఈ స్థాయి బిజినెస్ జరగడానికి కారణమైందని చెబుతున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో, మాళవిక శర్మ .. నివేద పేతురజ్ .. అమృత అయ్యర్ కథానాయికలుగా కనిపించనున్నారు.

More Telugu News