YS Jagan: మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను... విజయానికి ముందు మెట్టే పరాజయమని గుర్తుంచుకోండి: వైఎస్ జగన్

  • టీ-20 మహిళా టీమ్ కు అభినందనలు
  • ఫైనల్స్ వరకూ వెళ్లడమే గర్వకారణం
  • భవిష్యత్తులో సత్తా చాటండి
  • ట్విట్టర్ లో వైఎస్ జగన్
YS Jagan Congratulates Indian Cricket Women Team

భారత క్రికెట్ మహిళల జట్టు టీ-20 విమెన్ వరల్డ్ కప్ లో గుర్తుండి పోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, మహిళల టీమ్ కు అభినందనలు తెలిపారు. విజయానికి చివరి మెట్టుకు ముందు కూడా పరాజయమే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఫైనల్స్ వరకూ చేరుకోవడమే గర్వకారణమని వ్యాఖ్యానించిన ఆయన, భవిష్యత్తులో సత్తా చాటాలని అభిలషించారు. ఈ పోరులో విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు జగన్ కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు.

More Telugu News