Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్​ కు టీ–పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ

  • నిన్న అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉత్తమ్ స్పందన
  • ఎన్పీఆర్,  ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే మద్దతు ఇస్తాం
  • కేరళలో మాదిరి తెలంగాణలో కూడా జీవో తేవాలి
TPCC president Uttam kumar reddy has written a letter to CM KCR

జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు టీ–పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ లేఖ రాశారు. కేసీఆర్ చేసిన ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి కేరళ రాష్ట్రం జీవో తీసుకొచ్చినట్టుగా, తెలంగాణలో కూడా చేయాలని ఆ లేఖలో కోరారు.

More Telugu News