Telangana: రేపటికి వాయిదాపడ్డ తెలంగాణ శాసనసభ

  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి ఆమోదం
  • తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ సభ్యుడు ఆరూరి రమేశ్ 
  • బలపరిచిన టీఆర్ఎస్ మరో సభ్యుడు వివేకానంద
Telangana Assembly session postponed to tomorrow

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని టీఆర్ఎస్ సభ్యుడు ఆరూరి రమేశ్ ప్రవేశపెట్టగా, మరో సభ్యుడు వివేకానంద బలపరిచారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్ సహా అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

More Telugu News