Kajal Agarwal: క్రేన్ ప్రమాద ఘటనలో పోలీసు విచారణకు హీరోయిన్ కాజల్ ?

  • ఇండియన్-2 ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు
  • ఇప్పటికే  విచారణకు హాజరైన కమలహాసన్, శంకర్ 
  • కాజల్ కు సమన్లు జారీ చేయనున్న పోలీసులు 
Tamilnadu Police to Interrogate Kajal Agarwal On About Crane Accident

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పోలీసుల విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం. ఇండియన్-2 చిత్రం సెట్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం పోలీసులు కాజల్ కు సమన్లు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా తెరకెక్కుతోంది. దీన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది.

అయితే, చెన్నైలో గత నెల 19న సినిమా షూటింగ్ చేస్తుండగా ఓ క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించారు. ఆ సమయంలో అక్కడే  ఉన్న కమల్, కాజల్ తో పాటు దర్శకుడు శంకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కమల్, శంకర్, ప్రమాదం జరిగినప్పుడు లొకేషన్ లో ఉన్న ఇతర యూనిట్ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ ను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమన్లు అందుకున్న వెంటనే కాజల్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

More Telugu News