Airindia: కరోనా అలెర్ట్... వియన్నా నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులకు ఎయిరిండియా విజ్ఞప్తి!

  • ఫిబ్రవరి 25న వియన్నా నుంచి భారత్ కు వచ్చిన ఎయిరిండియా విమానం
  • అందులో ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
  • మిగతా ప్రయాణికులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న ఎయిరిండియా
Airindia alerts passengers due to corona out break

కరోనా వైరస్ భారత్ లోనూ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 25న వియన్నా నుంచి భారత్ కు వచ్చిన వారిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని వెల్లడించింది. ఫిబ్రవరి 25న ఆ విమానంలో ప్రయాణించినవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కాగా, చైనా, ఇరాన్, దక్షిణ కొరియాల తర్వాత యూరప్ లోనే కరోనా వైరస్ అత్యధిక ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో బాధితులయ్యారు. ఇటలీ వంటి దేశాల్లో మరణాలు కూడా సంభవించాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ప్రయాణికులను హెచ్చరించింది.

More Telugu News