ఉద్యోగులకు ఈ ఏడాది వేతనాల పెంపు తక్కువేనట!

Salary hikes in 2020 lowest in a decade
  • అవోన్ శాలరీ ఇంక్రీజ్ సర్వేలో బయటపడిన చేదు నిజం
  • ఈ దశాబ్దంలోనే అతి తక్కువగా పెరగనున్న వేతనాలు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం మాత్రమే హైక్
దేశంలోని వేతన జీవులకు ఇది నిరాశ కలిగించే వార్తే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ దశాబ్దంలోనే అత్యంత తక్కువగా వేతనాలు పెరగనున్నాయట. ‘అవోన్ శాలరీ ఇంక్రీజ్ సర్వే 2020’లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున 9.1 శాతం మేర జీతాలు పెరగనున్నాయి. 2009 తర్వాత ఇంత కనిష్ట స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో 6.6 శాతం మాత్రమే పెరగ్గా ఈసారి 9.1 శాతం పెరగనున్నాయి.

అప్పటితో పోలిస్తే కొంత మెరుగే అయినప్పటికీ ఈ దశాబ్దంలో మాత్రం ఇదే కనిష్టం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండేళ్లు 10.4 శాతం చొప్పున వేతనాలు పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి 2019 నాటికి 9.3 శాతానికి చేరాయి. ఈసారి ఇంకా తక్కువగా 9.1 శాతం మాత్రమే పెరగనున్నట్టు సర్వే వెల్లడించింది.
Go Back to Shorts
Aon Salary Increase Survey
Employees
India
Salary

More Telugu News