Vadde shobanadriswara Rao: జగన్, విజయసాయిరెడ్డిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు

  • రైతుల ఉద్యమంపై ప్రభుత్వ మొండి వైఖరి తగదు
  • సీఆర్డీఏను రద్దు చేయాలన్న జగన్ కుట్ర నెరవేరదు
  • జగన్, విజయసాయి జైలుకు వెళ్లొచ్చినా వారి దోపిడీలు ఆపలేదు
Vadde criticises on Jagan and vijayasai reddy

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. తుళ్లూరులో రైతుల మహాధర్నాకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, రాజధాని రైతుల ఉద్యమం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సీఆర్డీఏను రద్దు చేయాలన్న జగన్ కుట్ర నెరవేరదని అన్నారు.

అమరావతికి బీజేపీ అండగా ఉంటామని బీజేపీ ప్రకటించినప్పటికీ, ఎంపీ జీవీఎల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా ఆయన విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్లొచ్చినా వారి దోపిడీలు ఆపలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News