Chiranjeevi: సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్ట్‌ పసుపులేటి రామారావు మృతి.. చిరంజీవి సంతాపం

  • 50 ఏళ్లుగా పత్రికా రంగంలో సేవలు
  • పలు పుస్త‌కాలను ర‌చించిన పసుపులేటి 
  • చాలా సినిమాల‌కి పీఆర్ఓగా బాధ్యతలు
chiranjeevi saddened by the loss of senior journalist Pasupuleti

సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్ట్‌, సినీ పీఆర్ఓ ప‌సుపులేటి రామారావు ఈ రోజు మధ్యాహ్నం క‌న్నుమూశారు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన పత్రికా రంగంలో సేవలందించారు. సినీనటుడు చిరంజీవికి ఆయన ఆప్తుడు. ప‌సుపులేటి రామారావు పలు పుస్త‌కాలను కూడా ర‌చించారు. విశాలాంధ్ర ప‌త్రిక‌తో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత పలు పత్రికల్లో పనిచేశారు. సినిమాల‌కి పీఆర్ఓగా కూడా ప‌నిచేశారు. ఆయన స్వ‌స్థ‌లం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం.  
                     
దాదాపు అందరూ అగ్ర హీరోలను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. 'రామారావు నా ఆత్మబంధువు... ఆ కుటుంబానికి అండగా ఉంటా' అని  మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కన్నుమూశారని వార్త తెలుసుకుని బాధపడ్డానంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

More Telugu News