అయోధ్య ట్రస్టులో దళిత వర్గానికి ప్రాతినిధ్యం: అమిత్ షా
- ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉంటారు
- మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు అప్పగిస్తాం
- నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ట్రస్టే తీసుకుంటుంది
ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉంటారని అమిత్ షా చెప్పారు. సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకు ట్రస్టులో దళిత వర్గానికి చెందిన ఒకరికి ఎల్లప్పుడూ ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు అప్పగిస్తామని... ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు తీసుకుంటుందని చెప్పారు.