మరోసారి మహేశ్ బాబుకి జోడీగా కైరా అద్వాని

  • యూత్ లో కైరా అద్వానీకి విపరీతమైన క్రేజ్ 
  • గతంలో మహేశ్ తో చేసిన 'భరత్ అనే నేను'
  • వంశీ పైడిపల్లికి సిఫార్స్ చేసిన నమ్రత  
మహేశ్ బాబు తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. మహేశ్ బాబుకి ఇది 27వ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలను చేయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి అవకాశం లభిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. దాదాపుగా ఈ అవకాశం కైరా అద్వానికి దక్కవచ్చని అంటున్నారు. అంత నమ్మకంగా చెప్పడానికి గల కారణం .. ఆమెను సిఫార్స్ చేస్తున్నది 'నమ్రత' కావడమే.

మహేశ్ బాబు - కైరా అద్వాని కాంబినేషన్లో ఇంతకుముందు 'భరత్ అనే నేను' వచ్చింది. కథాకథనాలపరంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక మహేశ్ బాబు - కైరా జోడీకి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిందని భావించిన నమ్రత, తాజా చిత్రానికి కైరాను తీసుకోమని వంశీ పైడిపల్లికి చెప్పిందట. అందువలన కైరా ఎంపిక దాదాపు ఖరారైనట్టుగానే చెప్పుకోవాలి.
Go Back to Shorts
Mahesh Babu
Kiara Adwani

More Telugu News