పౌరసత్వ సవరణ చట్టంపై.. కేరళ బాటలో పంజాబ్!
- సీఏఏను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం ఆమోదం
- తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా
- గత డిసెంబర్ లో కేరళ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని, రాష్ట్రంలో కూడా నిరసనలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఈ తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఓకే చెప్పడంతో తీర్మానం నెగ్గింది. గతేడాది డిసెంబర్ లో కేరళ అసెంబ్లీ కూడా సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి అధికార పార్టీ చేసిన తీర్మానాన్ని విజయవంతంగా ఆమోదించింది.