రైతులు తమ అభిప్రాయాలు తెలపొచ్చు: మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన
- సీఆర్డీఏ వెబ్సైట్లో సాంకేతిక లోపం సవరించాం
- సీఆర్డీఏ ఈ-మెయిల్, వెబ్సైట్ పనిచేస్తోంది
- రైతులు తమ సూచనలు, సలహాలు చెప్పవచ్చు
కాగా, హైపవర్ కమిటీకి తమ అభ్యంతరాలు తెలిపేందుకు రైతులు కార్యాచరణ ప్రణాళిక వేసుకున్నారు. ప్రత్యేకంగా లేఖలు సిద్ధం చేసి సీఆర్డీఏ అధికారులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. అసైన్డ్ రైతులు, ఇతర రైతుల నుంచి సేకరించిన లేఖలను వేర్వేరుగా, నేరుగా సీఆర్డీఏ అధికారులకు అందించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది.