నరసరావుపేటలో ర్యాలీ.. అమరావతి కోసం జోలె పట్టిన చంద్రబాబు, జేఏసీ నేతలు

  • అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ర్యాలీ
  • విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పిన బాబు
  • ర్యాలీకి ముందు టీడీపీ కార్యాలయం నుంచి పాదయాత్ర  
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిర్వహించిన ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో రైతులు, ప్రజలు, టీడీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమం కోసం చంద్రబాబుతో పాటు జేఏసీ నేతలు జోలె పట్టి విరాళాలు స్వీకరించారు. విరాళాలు అందజేసిన ప్రతిఒక్కరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం, పల్నాడు బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అంతకుముందు, గుంటూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం నుంచి పాదయాత్రగా ప్రారంభమై స్థానిక మల్లమ్మసెంటర్, శివుని బొమ్మ, గడియార స్తంభం మీదుగా ర్యాలీ బయలుదేరింది.
Go Back to Shorts
Guntur District
Narasaraopet
Chandrababu

More Telugu News