అహింసకు ప్రాధాన్యమిచ్చే దేశంలో హింసాయుత దాడులు బాధాకరం: జేఎన్ యూ ఘటనపై నటి ట్వింకిల్
- ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి
- హింసాత్మక ఆందోళనలు ఆపకుంటే..ధర్నాలు, సమ్మెలు పెరుగుతాయి
- ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్ పోస్ట్ చేస్తూ వ్యాఖ్య
‘విద్యార్థులకంటే ఆవులకే ఎక్కువగా రక్షణ ఉన్న మనదేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి హింసాయుత ఘటనలు నిరోధించకపోతే, భవిష్యత్తులో ధర్నాలు, సమ్మెలతో మరింతమంది రోడ్లపైకి వస్తారు’ అని తన సందేశంలో తెలిపారు. అంతేకాక, ఈ ఘటనపై వార్తా పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ ను కూడా పోస్ట్ చేశారు.
నిన్నరాత్రి జేఎన్ యూలో ముసుగులు వేసుకున్న కొంత మంది చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి మీరు చేశారంటే మీరు చేశారని విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ధర్నాలకు దిగాయి. యూనివర్సిటీలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.