Hyderabad: హైదరాబాదులో విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఇసుక లారీ.. ఒకరి మృతి

  • హబ్సిగూడలో రోడ్డు ప్రమాదం
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఓ విద్యార్థి
  • ఏడుగురు విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్ హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూలుకు వెళ్తున్న విద్యార్థి జీవితాన్ని ఓ ఇసుక లారీ బలిగొంది. వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులను ఎక్కించుకుని స్కూలుకు వెళ్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొంది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో ఎనిమిది మంది విద్యార్థులు ఆటోలో ఉన్నారు.

ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ఉన్న మరో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థులు భాష్యం స్కూలుకు చెందినవారిగా గుర్తించారు. ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

లారీ డ్రైవర్ మల్లేశ్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 304ఏ, 337, 279 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News