లండన్ లో పరిచయమైన వ్యక్తిని వెతికి మరీ చాటింగ్ చేసిన యువతి... రూ. 15 లక్షలకు ముంచేశాడు!
- ఫేస్ బుక్ లో పరిచయస్తుడిని వెతికిన యువతి
- బహుమతి పంపుతున్నానని నమ్మబలికిన వ్యక్తి
- పలు దఫాలుగా డబ్బు కట్టిన తరువాత పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
జనవరి ఫస్ట్ సందర్భంగా అతను, విలువైన బహుమతిని పంపుతున్నానని చెప్పి ఆమెలో ఆశలు పెంచాడు. కస్టమ్స్ వాళ్లు ఏవైనా సుంకాలు చెల్లించాలని సూచిస్తే, కట్టి, దాన్ని తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. 5 లక్షల పౌండ్లున్న బాక్స్ బహుమతిగా వచ్చిందని, రూ. 2.50 లక్షలు పన్ను చెల్లించి, దాన్ని తీసుకోవచ్చని చెబితే, నమ్మిన బాధితురాలు డబ్బు పంపింది.
ఆపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు మరో రూ. 2.50 లక్షలు కట్టాలని చెబితే పంపింది. ఇలా పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 15 లక్షలు వసూలు చేశారు. ఎండ డబ్బు పంపినా బహుమతి రాకపోవడంతో అనుమానంతో అజయ్ కి ఫోన్ చేయగా, స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని భావించిన ఆమె, పోలీసులను ఆశ్రయించింది.