గిరిజన హాస్టల్లో కలకలం.. గర్భం దాల్చిన గిరిజన విద్యార్థినులు!
- అసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ వసతి గృహంలో ఘటన
- విద్యార్థినుల నుంచి వివరాలను తెలుసుకుంటున్న ఆర్సీవో
- హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు
నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు జరిపించగా ఒక్కరికే గర్భం అని వైద్యులు తేల్చారు. దీంతో.. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్సీవో లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలను తెలుసుకుని రికార్డు చేసుకుంటున్నారు. సుమారుగా రెండు నెలలముందే ఈ విషయం తెలిసినప్పటికీ.. సమాచారం అందికపోవడంపై హాస్టల్ సిబ్బందిపై, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.