Uttar Pradesh: ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో విధ్వంసానికి పాల్పడ్డ రోగి బంధువులు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

షార్ట్స్‌లో చూడండి
ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో కొందరు విధ్వంసానికి పాల్పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హృద్రోగ సమస్యలతో బాధపడుతోన్న ఓ రోగిని అతడి బంధువులు రామ్ పూర్ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అయితే, హృద్రోగ్య వైద్యులు అందుబాటులో లేరని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది వారికి సూచించారు. దీంతో ఆ రోగి బంధువులు రెచ్చిపోయారు. అత్యవసర చికిత్సా విభాగంలోని ఓ గదిలో ఉన్న టేబుల్, కుర్చీలు వంటి అన్ని వస్తువులను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. విధ్వంసానికి పాల్పడ్డ వారిలో మహిళలు కూడా ఉన్నారు.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News

More Telugu News