Eesha Rebbah: 'రాగల 24 గంటల్లో' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

  • థ్రిల్లర్ మూవీగా 'రాగల 24 గంటల్లో'
  • ప్రధాన పాత్రధారిగా ఈషా రెబ్బా 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో .. థ్రిల్లర్ జోనర్లో 'రాగల 24 గంటల్లో' చిత్రం రూపొందింది. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ఈ నెలాఖరులోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది.

హైదరాబాద్ లోని 'దసపల్లా కన్వెన్షన్' ఇందుకు వేదిక కానుంది. ఒక 24 గంటల్లో జరిగే ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా ఈ సినిమా నిర్మితమైంది. శ్రీరామ్ .. సత్యదేవ్ .. గణేశ్ వెంకట్రామన్ .. ముస్కాన్ సేథి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కుంచె రఘు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, 'గరుడవేగ' అంజి ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఈషా రెబ్బా బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

More Telugu News