ఏపీలో 1.82 లక్షల మంది ఎయిడ్స్ రోగులు.. దేశంలో రెండోస్థానం

  • దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఎయిడ్స్ రోగులు
  • ఐదో స్థానంలో తెలంగాణ
  • వెల్లడించిన జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక
హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. డిసెంబరు 2018 నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్టు జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక పేర్కొంది. వీరిలో ఏకంగా 1.82 లక్షల మంది ఏపీలోనే ఉండడం గమనార్హం. ఫలితంగా ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 78 వేల మందితో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.
Go Back to Shorts
HIV
AIDS
Andhra Pradesh
Telangana

More Telugu News