దుష్యంత్ చౌతాలాపై మండిపడ్డ కాంగ్రెస్
- జేజేపీ మద్దతుతో హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ
- అధికార కాంక్షకు జేజేపీ పెద్ద పీట వేసిందంటూ మండిపడ్డ కాంగ్రెస్
- బీజేపీకి జేజేపీ, లోక్ దళ్ పార్టీలు తొత్తులంటూ వ్యాఖ్య
హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారనేది నిజమనే విషయం అందరికీ తెలుసని సూర్జేవాలా అన్నారు. బీజేపీని వ్యతిరేకించడం వల్లే జేజేపీ 10 సీట్లను గెలుచుకుందని... బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఆ పార్టీ ప్రకటించిందని... ఇప్పుడు అధికార కాంక్షకే ఆ పార్టీ పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. సమాజాన్ని చీల్చి అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడు ప్రయత్నించినా... జేజేపీ, లోక్ దళ్ పార్టీలు దానికి తొత్తులుగా నిలుస్తున్నాయని విమర్శించారు.